సూపర్హిట్ అనే మాట విని ఎన్టీఆర్కి చాలాకాలమైంది. బృందావనం హిట్ టాక్ వక్కించుకొన్నా… వసూళ్ల పరంగా అద్భుతాలు సృష్టించలేదు. బాద్షా కూడా తన పవర్ సరిగా చూపించలేదు. మొన్నొచ్చిన రామయ్యా వస్తావయ్యా అయితే పూర్తిగా నిరాశ పరిచింది. ఇప్పుడు ఎన్టీఆర్ ఆశలన్నీ రభసపైనే. సంతోష్ శ్రీన్వాస్ దర్శకత్వం వహించిన చిత్రమిది. సమంత, ప్రణీత కథానాయికలు. ఎన్టీఆర్ ఫామ్లో లేకపోయినా.. ఈ సినిమాకి మంచి బిజినెస్ జరిగినట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. అన్నీ ఏరియాలు + శాటిలైట్ తో ఈ సినిమా రూ.50 కోట్లపైనే దక్కించుకొందట. విడుదలకు ముందే.. నిర్మాత బెల్లంకొండ సురేష్ లాబాల్లో పడ్డాడని మార్కెట్ పండితులు చెబుతున్నారు. ఈ చిత్రాన్ని రూ.40 కోట్లతో నిర్మించారని, ఆ లెక్కన దాదాపు పది కోట్లు లాభపడ్డారని చెప్పుకొంటున్నారు. అయితే ఎన్టీఆర్ అభిమానులు మాత్రం ఈసినిమా రూ.50 కోట్ల క్లబ్లో చేరుతుందన్న ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఎన్టీఆర్ సినిమా ఏదీ ఈ మ్యాజిక్ ఫిగర్ని అందుకోలేకపోయింది. ఆ లోటు.. రభసతో తీరుతుందేమో చూడాలి.