డిఫరెంట్ కాన్సెప్ట్ చిత్రాలతో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కథానాయకుడిగా, రమేష్ వర్మ పెన్మత్స దర్శకత్వంలో ఎ హవీష్ లక్ష్మణ్ కొనేరు ప్రొడక్షన్ బ్యానర్పై కొనేరు సత్యనారాయణ నిర్మాతగా తెరకెక్కిన చిత్రం `రాక్షసుడు`. తమిళంలో సూపర్ హిట్ అయిన ‘రాచ్చసన్’ సినిమాను ‘రాక్షసుడు’ పేరుతో తెలుగులో రీమేక్ చేశారు.
సాయి శ్రీనివాస్ కు జోడిగా అనుపమా పరమేశ్వరన్ నటించింది. ట్రైలర్తో సినిమాపై ఆసక్తిని రేకెత్తించిన ఈ సినిమా మంచి అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్ర షోస్ ఆల్రెడీ ఓవర్సీస్ లో పడడంతో చిత్ర టాక్ ముందే వచ్చింది. సినిమా చూసిన ప్రతి ఒక్కరు తమ స్పందనను సోషల్ మీడియా ద్వారా వ్యక్త పరుస్తున్నారు.
‘రాక్షసుడు’ సినిమా చాలా బాగుందని ప్రేక్షకులు కొనియాడుతున్నారు. శ్రీనివాస్ తన నటనతో ఆకట్టుకున్నారని.. గత సినిమాలతో పోలిస్తే ఇందులో ఆయన నటన చాలా బాగుందని చెపుతున్నారు. సినిమాకు హైలైట్ అంటే స్క్రీన్ప్లే అని చెబుతున్నారు. సినిమా చూస్తున్నంత సేపు తరవాత ఏం జరుగుతుందనే క్యూరియాసిటీని క్రియేట్ చేశారని అంటున్నారు.
అలాగే జిబ్రాన్ అందించిన బ్యాక్గ్రౌండ్ బాగుంది. ఇంటర్వెల్ బ్లాక్ అయితే అదిరిపోయిందని ఓవరాల్ గా సినిమా చాలా బాగుందని, ఎంగేజింగ్ థ్రిల్లర్ అని చెపుతున్నారు.