బెల్లం ‘కొండంత’ కష్టాలు..

బెల్లం కొండ సాయి శ్రీనివాస్ కు వచ్చిన కష్టాలు మారే ఏ హీరో కు లేవనే చెప్పాలి..హీరోగా తనకు తాను ప్రూవ్ చేసుకోవాలని గట్టి ప్రయత్నాలే చేస్తున్నప్పటికీ..ఆ ప్రయత్నాలన్నీ నీళ్ల పాలే అవుతున్నాయి. ఇలాంటి కథ తో వచ్చిన కానీ ప్రేక్షకులను మాత్రం మొదటి రోజే ల్యాబ్ కు పంపిస్తున్నారు. వరుస పెట్టి సినిమాలు చేస్తూనే ఉన్నాడు..కానీ హిట్ మాత్రం దక్కడం లేదు.

రీసెంట్ గా సీత ఫై భారీ ఆశలే పెట్టుకున్నప్పటికీ అది కూడా నిరాశనే మిగల్చడం తో ఇప్పుడు ఆశలన్నీ రాక్షసుడు పైనే పెట్టుకున్నాడు. తమిళ సినిమా ‘రాట్చసన్’ రీమేక్ గా తెరకెక్కిన ఈ మూవీ ని రమేష్ వర్మ డైరెక్ట్ చేయగా.. ఎ స్టూడియోస్ బ్యానర్ పై కోనేరు సత్యనారాయణ ఈ చిత్రాన్ని నిర్మించారు. కాగా ఈ సినిమాను జులై 19 న రిలీజ్ చేస్తున్నట్లు గతంలో ప్రకటించి ఆ ఏర్పాట్లలో ఉన్నారు. అయితే ఇప్పుడు ఇస్మార్ట్ శంకర్ జులై 18 కి వాయిదా వేయడం తో రాక్షసుడు నిర్మాతల్లో భయం పట్టుకుంది. అసలే వరుస ప్లాప్స్ తో ఇబ్బంది పడుతున్న సాయి..కి ఇప్పుడు ఇస్మార్ట్ పోటీ రావడం తో ఓపెనింగ్ వస్తాయా..రావా..ఒకవేళ వాయిదా వేస్తే ఎలా ఉంటుందనే ఆలోచనలో పడ్డారట. ఒకవేళ మరో తేదికి వాయిదా వేద్దామన్న ఏ స్లాట్ ఖాళీగా లేదు.

విజయ్ దేవరకొండ డియర్ కామ్రేడ్ నుండి మొదలు పెడితే ఆగస్టు 23 వరకు ఖాళీ లేదు. అప్పటివరకు విడుదల చేయకపోతే ఇంకాస్త ఇబ్బంది..ఒకవేళ ఇప్పుడే విడుదల చేస్తే కలెక్షన్లు ఎలా ఉంటాయో అని భయపడుతున్నారు. ఒకవేళ జులై 12 కి విడుదల చేస్తే ఎలా ఉంటుందనే ఆలోచన కూడా చేస్తున్నారు. మొత్తం మీద మరో మూడు రోజుల్లో ఈ చిత్ర రిలీజ్ డేట్ విషయంలో ఓ క్లారిటీ రానుంది.