దాదాపు మూడేళ్లుగా చిత్రీకరణ జరుపుకొంటున్న చిత్రం రేయ్. ఫేడ్ అవుట్ అయిపోతుందన్న భయం నుంచి.. ఈ సినిమాకి ఒకొక్క మెరుగూ దిద్దుకొంటూ వస్తున్నాడు వైవిఎస్ చౌదరి. చిరంజీవి సినిమాలోని పాటని రేయ్ కోసం రీమిక్స్ చేసి.. కొత్త హంగు అద్దాడు. పవన్ పాటనీ వాడుకొన్నాడు. ఇప్పుడు ఇంకో ఎట్రాక్షన్. అదే.. ఈ సినిమాకి రామ్ వాయిస్ ఓవర్ అందివ్వడం. ఔను.. రేయ్లో రామ్ గొంతు వినిపించనుంది. ఈ విషయాన్ని చిత్రబృందం ప్రకటించింది కూడా. ”మా సినిమాలోని కొన్ని కీలక సన్నివేశాలకు వాయిస్ ఓవర్ అవసరం. రామ్ని అడగ్గానే ఒప్పుకొన్నాడు. అతని వాయిస్ రికార్డ్ చేశాం” అని దర్శకుడు చెబుతున్నాడు. సాయి ధరమ్ తేజ సరసన శ్రద్ధ దాస్, సయామీ ఖేర్ హీరోయిన్స్ నటించిన ఈచిత్రం మే 9న విడుదలకు సిద్దమయింది. చిత్రానికి చక్రీ మ్యూజిక్ అందించారు.