సాహో రెండో రోజు కలెక్షన్ల జోరు ఎలా ఉందంటే..

భారీ అంచనాల మధ్య విడుదలైన సాహో చిత్రం..మొదటి రోజు మొదటి ఆట తోనే నెగిటివ్ టాక్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. కానీ టాక్ తో సంబంధం లేకుండా ఫస్ట్ డే భారీ ఓపెనింగ్స్ సాధించి వార్తల్లో నిలిచింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో మొదటి రోజు రూ.35.2 కోట్ల షేర్ వసూలు చేయగా.. ముంబై బాక్సాఫీస్ వద్ద కూడా రూ.24 కోట్ల గ్రాస్ , తమిళ వెర్షన్‌లో రూ.11 కోట్లు రాబట్టి వార్తల్లో నిలిచింది. ఇక రెండో రోజు కూడా సాహో సందడి అలాగే ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో రెండో రోజు రూ. 10 కోట్లకి పైగా షేర్ రాబట్టింది. నైజాంలో మొదటిరోజే ‘బాహుబలి’ రికార్డ్‌ను దక్కించుకున్న ‘సాహో’.. రెండో రోజు అదే దూకుడు కొనసాగిస్తూ రూ. 5 కోట్ల 20 లక్షల షేర్‌ని రికార్డ్ చేసింది. కర్ణాటక, కేరళ, తమిళనాడులోను మంచి కలెక్షన్లే రాబట్టింది. ఆ మూడు స్టేట్స్ వరకు రూ. 10 కోట్ల గ్రాస్ రాబట్టింది. ఓవరాల్‌గా చూసుకుంటే సెకండ్ డే ఇండియా మొత్తంగా రూ. 60 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసింది. దీంతో రెండు రోజులకి సాహో కలెక్షన్స్ ఇండియా గ్రాస్ రూ. 164.9 కోట్లుగా ఉంది. షేర్ రూ. 99.4 కోట్లుగా ఉంది.