ఆ రెండు రాష్ట్రాల్లో ప్రభాస్ కుమ్మేసాడు..

బాహుబలి తర్వాత భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం సాహో. ప్రభాస్ – శ్రద్ద కపూర్ జంటగా సుజిత్ డైరెక్షన్లో భారీ యాక్షన్ మూవీ గా ఆగస్టు 30 న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ అంచనాలను అందుకోలేకపోయింది. మొదటి రోజు మొదటి షో తోనే నెగిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ మూవీ హిందీ లో తప్ప అన్ని భాషల్లో నష్టాలనే మిగిల్చింది.

హిందీ లో టాక్ తో సంబంధం లేకుండా సినిమా దాదాపుగా రూ. 150 కోట్ల రూపాయలు పైగా వసూలు చేసింది.  ఇక ఒడిశా, బీహార్ రాష్ట్రాల్లో ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ రావడం విశేషం.  బాహుబలి 2 తరువాత ఆ స్థాయిలో వసూళ్లు సాధించిన సినిమాగా సాహో నిలిచింది.  అటు బీహార్ లో కూడా అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాల జాబితాలో ఆరో స్థానంలో నిలిచింది సాహో.  భజరంగి భాయ్ జాన్, పీకే, సింబా చిత్రాలకు మించి అక్కడ వసూళ్లు సాధించి రికార్డుకెక్కింది సాహో. మొత్తం మీద ఈ రెండు రాష్ట్రాల్లో భారీ వసూళ్లు రాబట్టి అభిమానుల పరువు నిలబెట్టింది.

ప్రస్తుతం ప్రభాస్ రాధాకృష్ణ డైరెక్షన్లో జాన్ అనే సినిమా చేస్తున్నాడు. పూజా హగ్దే హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ ని యూవీ గోపికృష్ణ బ్యానర్ లు నిర్మిస్తున్నాయి.