సాహో ఆ రెండు ఏరియాలు దిల్ రాజుకే..?

ప్రభాస్ – సుజిత్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ మూవీ సాహో. ఈ మూవీ ఫై ఉన్న అంచనాల నేపథ్యంలో ఈ సినిమా రైట్స్ ను దక్కించుకునేందుకు అగ్ర నిర్మాణ సంస్థలు , డిస్ట్రిబ్యూటర్స్ పోటీ పడుతున్నారు. ఇక ఇప్పుడు రిలీజ్ సమయం దగ్గర పడుతుండడం తో అన్ని ఏరియాల నుండి ఇంకాస్త ఒత్తిడి పెరుగుతుంది. తాజాగా అందుతున్న సమాచారం మేరకు నైజాం..ఉత్తరాంధ్ర రైట్స్ దిల్ రాజు కైవసం చేసుకున్నాడని సమాచారం. ఈ రెండు ఏరియాలు కలిపి సుమారు 45 కోట్ల దాకా ఆఫర్ చేసినట్టు తెలుస్తుంది.

రాజు గారు కాకుండా వేరే వారు కూడా అంతకు మించి డబ్బులు ఇస్తామని వచ్చినప్పటికీ యువీ వారు దిల్ రాజు కు మొగ్గు చూపించినట్లు తెలుస్తుంది. దిల్ రాజు నిర్మాణ రంగంలోనే కాదు డిస్ట్రిబ్యూటర్ రంగంలో కూడా అగ్రగణ్యుడు. సినిమా ప్రమోషన్ దగ్గరి నుండి థియేటర్స్ లలో బొమ్మ పడే వరకు కూడా అన్ని దగ్గరి ఉండి చూసుకుంటాడు..అందుకే రాజు కు ఈ రైట్స్ ఇచ్చినట్లు తెలుస్తుంది. ఇక ఈ ఏడాది రాజు గారు పట్టిందల్లా బంగారం అవుతుంది. ఎఫ్ 2 దగ్గరి నుండి మొదలు పెడితే మహర్షి వరకు ఆయన నిర్మించిన సినిమాలే కాకుండా డిస్ట్రిబ్యూట్ చేసిన సినిమాలు సైతం భారీ హిట్లు అయ్యాయి. అది కూడా సాహో కు కలిసొస్తుందని యువీ వారు భావించినట్లుంది . మరి సాహో రాజు గారికి ఎంత లాభాలు తెస్తుందో చూడాలి.