‘సాహో’ టీజర్ టాక్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ‘సాహో’ టీజర్ వచ్చేసింది. శ్రద్దా కపూర్ కూల్ మూడులో టీజర్ ప్రారంభం అవుతోంది. ఆ తర్వాత యాక్షన్ ని చూపించారు. టీజర్ లో యాక్షన్ సీన్స్ తో పాటు రొమాంటిక్ సీన్స్ ని జోడించారు. ఐతే, యాక్షన్ హైలైట్ గా నిలిచింది. స్టోరీ లైన్ ని లీక్ చేయడకుండా యాక్షన్ మూడుని మాత్రమే హైలైట్ చేసే ప్రయత్నం చేశారు. హాలీవుడ్ సినిమాని రేంజ్ లో సాహో యాక్షన్ ఉందని చెప్పవచ్చు.

ఈ చిత్రానికి సుజీత్‌ దర్శకత్వం వహిస్తున్నారు. బాలీవుడ్‌ నటి శ్రద్ధా కపూర్‌ కథానాయిక. నీల్‌ నితిన్‌ ముఖేశ్‌ ప్రతినాయకుడి పాత్రను పోషిస్తున్నారు. ఎవ్లిన్‌ శర్మ, మురళీ శర్మ, జాకీ ష్రాఫ్‌, మందిరా బేడీ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. చివరి షెడ్యూల్‌ చిత్రీకరణ ముంబయిలో జరుగుతోంది. ఆగస్టు 15న సాహో ప్రేక్షకుల ముందుకు రానుంది.