‘అందాల రాక్షసి’, ‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’ చిత్రాలతో మంచి పేరు తెచ్చుకునాడు హను రాఘవపూడి. ఇప్పుడు శర్వానంద్ కథానాయకుడిగా ‘పడి పడి లేచె మనసు’ తీస్తున్నాడు. సాయిపల్లవి కథానాయిక. ఈ చిత్రంలో సాయిపల్లవి క్రీడాకారిణిగా కనిపించనున్నారని సమాచారం. ఆమె ఫుట్బాల్ ప్లేయర్గా నటిస్తున్నారని ప్రచారం జరుగుతోంది.
క్రీడాకారిణి పాత్రల్లో నటించేందుకు నటీమణులు ఆసక్తి చూపుతున్నారు. బాలీవుడ్ చిత్రం ‘సూర్మ’లో తాప్సి హాకీ ప్లేయర్గా, ‘డియర్ కామ్రేడ్’ చిత్రంలో రష్మికా మందన్న క్రికెటర్గా కనిపించనున్నారు. ఇప్పుడు సాయి పల్లవి కూడా చేరింది. ‘ ఫిదా’ సినిమాతో సాయిపల్లవి టాలీవుడ్లో హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. తర్వాత ఆమె నటించిన ‘ఎంసీఏ’, ‘కణం’ చిత్రాలు విడుదలయ్యాయి. ఇపుడు ఆమె నుండి వస్తున్న ఈ సినిమాపై కూడా ఆసక్తినెలకొంది.