తమ సినిమా ప్రమోషన్ కోసం బాలీవుడ్ హీరోహీరోయిన్లు ఎదైనా చేసెందుకు,ఎంతకైనా తెగించెందుకు సిధ్ధపడుతుంటారు. ఎఫైర్లతో సినిమాకు క్రేజ్ను తీసుకువచ్చే వారు కొందరయితే..వివాదాప్పద విషయాలతో ఆడియోన్స్ అటెన్షన్ కొట్టేసే వారు మరికొందరు.ఇప్పుడు సూపర్స్టార్ సల్మాన్ఖాన్ కూడా తన జయహో సినిమా ప్రమోషన్ కోసం తనకు సంబంధం లేని విషయాలు,వివాదాల గురించి మాట్లాడేస్తున్నాడు.
ఈ నెల 24 న విడుదల కానున్న జయహో ప్రమోషన్ కొసం దేశమంతా పర్యటిస్తున్న సల్లుభాయ్ ఆ మధ్య గుజరాత్ వెళ్ళి మోడీతో కలిసి గాలిపటాలు ఎగర వేశాడు. మోడీ ప్రధాని కావాలంటూ ఆయన్ను ఓరెంజ్లో పొగిడేశాడు. మోడీతో తన మీటింగ్ గురించి అందరి వద్ద గొప్పగా చేప్పుకున్న సల్లుభాయ్ గోద్రా అల్లర్ల విషయంలో మోడీ తప్పే లేదంటూ ఓ జడ్జిమెంట్ ను ఇచ్చేశాడు. ఇది విన్న కొన్ని మతవర్గాలవారు..సల్మాన్కు ఏ తెలిసి మాట్లాడుతున్నాడంటూసీరియస్ అయ్యారు.
ఏదో తన సినిమా ప్రమోషన్ కోసం ఓ మాట ఎక్కువగా మాట్లాడితే..చివరికి అదే సినిమా వసూళ్ళపై ఎఫెక్ట్ పడే పరిస్ధితి ఏర్పడింది. జయహో సినిమాను చూడకూడదంటూ ఇప్పటికే పలువురు మత పెద్దలు అనధికార ఫత్వాలను జారీచేశారు.వాక్ స్వాతంత్ర్యం ఉంది కదా
అని ఎక్కువగా మాట్లాడితే మొదటికే మోసం వస్తుందని సల్మాన్ కు ఈ సంఘటన తో బాగా తెలిసోచ్చింది. ప్రమోషన్ చేయాలి కాని ఓవర్ ప్రమోషన్ చేస్తే ఇలాంటి పరిణామాలే ఎదురౌతాయి మరి.