’గాలిపటం’ నిర్మిస్తున్నాడు..

sampathరామ్ చరణ్ తో ’రచ్చ’ చేయించిన దర్శకుడు సంపత్ నంది. ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చిత్రం ’గబ్బర్ సింగ్ 2’కి దర్శకత్వం వహిస్తున్నాడు. త్వరలో నిర్మాతగా మారబోతున్నాడు. స్న్హేహితులతో కలసి ఓ చిత్రాన్ని నిర్మించడానికి ప్లాన్ చేస్తున్నాడు సంపత్. కొత్త హీరోహీరోయిన్స్ తో ’గాలిపటం’ అనే చిత్రాన్ని నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. వచ్చే నెలలో ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్లనున్నట్లు సమాచారం. హీరోహీరోయిన్స్ ఎవరనేది తెలియాల్సి వుంది.