సరిలేరు నీకెవ్వరూ పబ్లిక్ టాక్ …

సూపర్‌ స్టార్‌ మహేష్ బాబు హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా సరిలేరు నీకెవ్వరు. దిల్‌ రాజు సమర్పణలో జీఎంబీ ఎంటర్‌టైన్మెంట్స్‌, ఏకే ఎంటర్‌టైన్మెంట్స్‌ బ్యానర్‌లపై నిర్మించబడిన ఈ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌ సంక్రాంతి కానుకగా ఈరోజు (జనవరి 11న ) భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

సక్సెస్ ఫుల్ హీరోయిన్ రష్మిక మహేష్ కు జోడిగా నటించగా..లేడి సూపర్ స్టార్ విజయశాంతి దాదాపు 13 ఏళ్ల తర్వాత ఈ సినిమా తో రీ ఎంట్రీ ఇచ్చింది. అలాగే రావు రమేష్ , ప్రకాష్ రాజ్ , రాజేంద్ర ప్రసాద్ , సంగీత , పోసాని , వెన్నెల కిషోర్ మొదలగు స్టార్ట్ నటి నటులు ఈ చిత్రం లో నటించారు. మరి ఈ భారీ మూవీ ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంది..? సంక్రాంతి బరిలో సక్సెస్ కొట్టిందా..లేదా..? మహేష్ ను అనిల్ రావిపూడి ఏ విధంగా చూపించాడు..? టైటిల్ కు తగ్గట్లే సరిలేరు అనిపించుకుందా..? అనేది పబ్లిక్ టాక్ లో చూద్దాం.

రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఆరు షో లకు గాను అనుమతి ఇవ్వడం తో అర్ధరాత్రి నుండే థియేటర్స్ లలో సరిలేరు సందడి మొదలు అయ్యింది. దీంతో పబ్లిక్ టాక్ రాత్రి నుండే వైరల్ గా మారింది. ఇక సినిమా చూసిన ప్రతి ఒక్కరు సంక్రాంతి విజేత సరిలేరు అంటున్నారు.

ఫస్ట్ హాఫ్ అంతా కాశ్మీర్ తో పాటు అద్భుతమైన కామెడీ సన్నివేశాలతో ప్రేక్షకులను ఫుల్ గా నవ్వించిన అనిల్. ఇక ఇంటర్వెల్ బ్యాంగ్ ఈ మధ్య కాలంలో ఏ స్టార్ హీరో సినిమాకు ఉండని స్థాయిలో పెట్టి ఆకట్టుకున్నారని చెపుతున్నారు. సెకండ్ హాఫ్ మొత్తం కూడా ప్రకాష్ రాజ్ – విజయశాంతి – మహేష్ లతో పూర్తీ చేసాడని.. ఎక్కడ కూడా బోర్ కొట్టకుండా యాక్షన్ కామెడీతో అనిల్ నడిపించాడని చెపుతున్నారు. ఓవరాల్ గా ఈ సంక్రాంతికి మహేష్ బాబు బ్లాక్ బస్టర్ తో అసలైన పండగ తీసుకొచ్చాడని తేల్చి చెపుతున్నారు.