ఈరోజే సరిలేరు ‘మెగా’ ఈవెంట్…..

మెగా , మహేష్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న అసలు సిసలైన మెగా ఈవెంట్ ఈరోజు హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియం లో జరగబోతుంది. మెగా ఈవెంట్ కు సిద్దమవుతున్న ఎల్బీ స్టేడియం..

సూపర్ స్టార్ మహేష్ కథానాయకుడిగా నటించిన సరిలేరు నీకెవ్వరు సంక్రాంతి కానుకగా జనవరిలో రిలీజవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ చిత్రం తాజాగా సెన్సార్‌ కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకోవడం విశేషం. ఇక ఈరోజు సరిలేరు నీకెవ్వరూ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఎల్బీ స్టేడియంలో భారీ ఎత్తున నిర్వహించబోతున్నారు.

ఈ వేడుకకు మెగా స్టార్ చిరంజీవి,ముఖ్య అతిధిగా వస్తుండడంతో ఈ ఈవెంట్ ఫై అందరిలో ఆసక్తి నెలకొని ఉంది. అలాగే లేడి అమితాబ్ విజయశాంతి సైతం ఈ వేడుకకు రాబోతుండడం ..స్టేజ్ ఫై చిరు , విజయశాంతి ల జోడి ని చూసేందుకు మెగా అభిమానులు ఆతృతగా ఉన్నారు. మునుపెన్నడూ లేని విధంగా ఈవెంట్ ను ప్లాన్ చేసారు. మహేష్ అభిమానులకే కాదు మెగా అభిమానులకు సైతం ఎప్పటికి గుర్తుండిపోయేలా ఈ ఫంక్షన్ ను జరపబోతున్నట్లు సమాచారం.

అనిల్ రావిపూడి డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రష్మిక హీరోయిన్ గా నటిస్తుండగా..దేవి శ్రీ మ్యూజిక్. అనిల్ సుంకర , దిల్ రాజు లు నిర్మిస్తున్నారు.