గోపీచంద్, తాప్సీ జంటగా చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘సాహసం’. ఉగాది సందర్భంగా ఈ చిత్రం ఫస్ట్ లుక్ ని విడుదల చేసారు. నిధి నిక్షేపాల అన్వేషణే ప్రధాన నేపథ్యంగా ఈ చిత్రం వుండబోతుంది. రిలయన్స్ ఎంటర్టైన్మైంట్స్ సమర్పణలో బీవీఎస్ఎన్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోన్న ఈ చిత్రం ఏప్రిల్ చివరి వారంలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో సన్నివేశాలను ఎక్కువ భాగం లడక్, రాజస్థాన్, జోర్డాన్లలో అడవులలో తెరకెక్కించారు. ఈ’సాహసం’ …అడ్వెంచరస్, యాక్షన్ థ్రిల్లర్గా వుండబోతుందని ఈ ఫస్ట్ లుక్ లోనే తెలుస్తోంది.