మహేష్-వంశీ సినిమా వాయిదా వెనక షాకింగ్ నిజాలు 

సూపర్ స్టార్ మహేష్ మెచ్చిన దర్శకుడు వంశీపైడిపల్లి. అందుకే ‘మహర్షి’ సినిమా తర్వాత మరో సినిమా చేసే ఛాన్స్ ఇచ్చాడు. వంశీ కూడా మహేష్ కోసం మంచి కథని రాశాడు. అయితే, ఫైనల్ స్క్రిప్ట్ మహేష్ కి నచ్చలేదు. దాంతో సినిమాని వాయిదా వేశారనే ప్రచారం జరిగింది. అయితే ఇక్కడ వంశీ పైడిపల్లి, స్క్రిప్ట్ అన్నది మాత్రమే సమస్య కాదు. ఇంకేదో వుంది. అదేంటీ అన్నది ఇండస్ట్రీలోని కీలక సర్కిళ్లలో మాత్రం వినిపిస్తోంది.  అదేటంటే.. ?

మహర్షి సినిమాకు నిర్మాతలకు లాభాలు రాలేదు. దిల్ రాజుకు అందుకే సరిలేరు నీకెవ్వరు సినిమా వైజాగ్, నైజాం హక్కులు డిస్కౌంట్ చేసి ఇచ్చారు. పివిపికి అయితే అదీ లేదు. ఇక సరిలేరు నీకెవ్వరు సినిమా పండగ టైమ్ లో మంచి ఊపు మీద ఆడేయడంతో నిర్మాత గట్టెక్కారు. లేదూ అంటే ఆ సినిమా బడ్జెట్ కు అనిల్ సుంకర కూడా ఇబ్బందిలో పడేవారు.

ఈ విషయాలు క్లోజ్ గా తెలిసిన దిల్ రాజు. వంశీ పైడిపల్లి సినిమాకు రెమ్యూనిరేషన్ కొంచెం తగ్గించకుంటే వర్కవుట్ కాదని ప్రపోజల్ పెట్టినట్లు తెలుస్తోంది. దానిని మనసులో ఉంచుకొని.. స్క్రిప్ట్ నచ్చలేదనే సాకుతో మహేష్ సినిమాని హోల్డ్ లో పెట్టేశాడని.. మరో కొత్త దర్శకుడు… కొత్త సినిమా చేసేందుకు ప్లాన్ చేసుకుంటున్నట్టు సమాచార్. మహెష్ ఇంత కమర్షియల్ నా ? అవుననే అంటున్నారు.