కశ్మీర్ ఉగ్రదాడుల్లో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలను ఆదుకొనేందుకు అక్టోబర్ 15న అమెరికాలోని న్యూజెర్సీలో ‘స్వచ్ఛంద కచేరి’అనే కార్యక్రమం జరగనుంది. రిపబ్లికన్ హిందూ కొలిజియం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమంలో టాలీవుడ్ నుండి రామ్చరణ్ పాల్గొంటున్నాడు.
ఇప్పుడీ కార్యక్రమంలో హీరోయిన్ శ్రియా బాగం కానుంది. దేశంలో ఉగ్రదాడుల్ని ప్రతీ భారతీయుడు తీవ్రంగా ఖండించాలని , దేశం కోసం పోరాడుతున్న భారత సైనికులు, వారి కుటుంబాలకు అంతా అండగా నిలవాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది శ్రియ. ఇలాంటి కార్యక్రమంలో పాల్గొనడం తనకెంతో సంతోషాన్ని ఇస్తుందని చెప్పుకొచ్చింది శ్రియ
ఈ కార్యక్రమంలో చరణ్ తో పాటి అఖిల్, ప్రభుదేవా.. పలువురులు బాలీవుడ్ తారలు కూడా పాల్గొంటారు.