ఎన్నికల సమయంలో పవన్ ను ఇరకాటంలో పడేస్తున్న శ్రీ రెడ్డి..?

శ్రీ రెడ్డి..ఈమె గురించి కొత్తగా..ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కాస్టింగ్ కౌచ్ అంటూ మొదలుపెట్టిన ఈమె ఆ తర్వాత ఏం చేసిందో తెలియంది కాదు. కొన్ని రోజులుగా సైలెంట్ గా ఉన్న ఈమె..తాజాగా రెచ్చిపోతుంది. యూట్యూబ్ లో సొంతంగా ఓ ఛానల్ ఓపెన్ చేసి మళ్లీ కొంతమందిని టార్గెట్ చేయడం మొదలు పెట్టింది. తాజాగా మరోసారి పవన్ – త్రివిక్రమ్ లపై విరుచుకుపడింది.

పవన్ వల్ల పూనమ్ కౌర్ కెరియర్ నాశనం చేసుకుందని , చివరకు సూసైడ్ వరకు వెళ్లిందని తెలిపిన శ్రీ రెడ్డి., త్రివిక్రమ్ పార్వతి మెల్టన్ తో ప్రేమాయణం కొనసాగించాడని చెప్పుకొచ్చింది. పవన్ – త్రివిక్రమ్ ఇద్దరూ అమ్మాయిల పిచ్చోళ్లు (ఉమనైజర్స్) అని..పవన్ వల్ల పూనమ్ కౌర్ చాలా బాధపడిందని.. తన కష్టాలు ఇండస్ట్రీలో ఎవరికీ తెలియవని తెలిపింది. “పవన్ ను పూనమ్ కౌర్ చాలా ఇష్టపడింది. ఆయన దేవుడు. నాకు సర్వస్వం అని గతంలో చెప్పింది. ఆయనను పెళ్లి చేసుకోవాలని లేదు. కేవలం అనుబంధం ఉంటే చాలు అని శ్రీరెడ్డి తెలిపింది. ఆయన కారణంగా పూనమ్ సూసైడ్ చేసుకొంది“ అంటూ తెలిపింది. అక్కడి తో ఆగకుండా పూనమ్ కౌర్ కు పవన్ కడుపు చేసాడని..ఇదంతా రేణు దేశాయి కి తెలుసంటూ శ్రీ రెడ్డి తెలిపింది.

పార్వతి మెల్టన్ ను త్రివిక్రమ్ వేధించారని ఆయన ప్రేమల పడిన పార్వతి జీవితాన్ని కాలరాశాడని ఘాటైన వ్యాఖ్యలు చేశారు. పార్వతి మెల్టన్ ఆఫర్లు కోల్పోవడానికి త్రివిక్రమ్ కారణమని అంది. మొత్తం మీద ఎన్నికల సమయంలో పవన్ ను టార్గెట్ చేయడం పట్ల అంత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎవరో కావాలని ఇదంతా చేయిస్తున్నారని , పవన్ ఇమేజ్ ను దెబ్బతీయాలని చేస్తున్న కుట్ర తప్ప మరొకటి కాదని అంటున్నారు..ఇంకా శ్రీ రెడ్డి ఏమన్నదో మీరే ఈ కింది వీడియో ద్వారా చూడండి.