నట కిరీటీ రాజేంద్రప్రసాద్కి దాసరి నారాయణరావు – శ్రుతిలయ సంస్థ స్వర్ణకంకణ పురస్కారాన్ని ప్రకటించింది. ఈ మేరకు శ్రుతిలయ సంస్థ ఓ ప్రకటన విడుదల చేసింది. దాసరి నారాయణరావుగారి 68వ జన్మదినం సందర్భంగా ఈ ఏడాది నుంచి స్వర్ణ కంకణ పురస్కారాన్ని ప్రవేశపెడుతున్నాం. రేలంగి నరసింహారావు అధ్యక్షులుగా, కె.ధర్మారావు కన్వీనర్గా ఏర్పాటైన కమిటీ రాజేంద్రప్రసాద్కు ఈ పురస్కారం అందించాలని నిర్ణయించింది. ఈ నెల 29న హైదరాబాద్లో జరిగే కార్యక్రమంలో దాసరి నారాయణరావుగారు ఈ పురస్కారాన్ని అందజేస్తారు.