రేపే సైరా సెన్సార్..?

మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా నరసింహ రెడ్డి చిత్ర సెన్సార్ కార్య క్రమాలు రేపు జరిగే అవకాశం ఉందని తెలుస్తుంది. సురేందర్ రెడ్డి డైరెక్షన్లో ఉయ్యాలా వాడ నరసింహ రెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ మూవీ అక్టోబర్ 02 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. కొణెదల ప్రొడక్షన్ హౌస్ బ్యానర్ ఫై రామ్ చరణ్ నిర్మించగా..నయనతార , బిగ్ బి , విజయ్ సేతుపతి మొదలగు భారీ తారాగణం ఈ మూవీ లో నటించడం జరిగింది.

తెలుగు, తమిళ్ , హిందీ , మలయాళ ఇలా అన్ని భాషల్లో సినిమా విడుదల కాబోతుండడం తో అన్ని భాషల్లో ఈ మూవీ ఫై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఈ నేపథ్యంలో చిత్ర సెన్సార్ కార్య క్రమం పూర్తి చేసి ప్రొమోషన్ల ఫై పూర్తి దృష్టి పెట్టాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తుంది. ఒకవేళ సోమవారం సెన్సార్ జరగకపోయినా మంగళవారం అయినా పక్కాగా పూర్తి చేయాలనీ చూస్తున్నారు. అదే రోజు సైరా ఎంత నిడివి ఉంది ఎన్ని కట్స్ ఇచ్చారు లాంటి వివరాలు బయటికి వస్తాయి.