తమిళ్ రాకర్స్ ఈ పేరు వింటే నిర్మాతలు వణికిపోతున్నారు. ముఖ్యం గా తమిళ్ ప్రొడ్యూసర్స్ అయితే ఈ పేరు చెపితే చాలు తలలు పట్టుకుంటున్నారు. విడుదలైన మొదటి రోజే పైరసీ చేసి నెట్ లో వదలడం తమిళ్ రాకర్స్ పని. గతంలో చెప్పకుండా సినిమాను పైరసీ చేసేవారు. కానీ ఈ మధ్య చెప్పి చేస్తూ తమ వానికిని చాటుకుంటున్నారు. తాజాగా శంకర్ తెరకెక్కించిన 2 .ఓ చిత్రాన్ని సైతం పైరసీ చేస్తామని హెచ్చరించారు.
“2.ఓ”ను తొలిరోజే ఆన్లైన్లో అప్ లోడ్ చేస్తాం చూసుకోండి అంటూ సవాల్ విసిరింది ఈ సైట్ యాజమాన్యం. ఎన్నో పైరసీ సైట్లపై దాడులు చేసి మూయిస్తున్నారు కానీ తమిళ్ రాకర్స్పై మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోలేకపోతున్నారు పోలీసులు. వాళ్లను రెచ్చగొట్టిన ప్రతీసారి ఇంకా త్వరగా పైరసీ లింకులు పోస్ట్ చేసి షాక్ ఇస్తున్నారు. తాజాగా దీపావళి కి విడుదలైన “సర్కార్” సినిమా లింక్ కూడా తొలిరోజు తొలి షో పడగానే పోస్ట్ చేసారు. అది కూడా చెప్పి మరీ చేసారు. ఇప్పుడు రజినీకాంత్ “2.0”ను కూడా అలాగే విడుదల చేస్తామంటూ వార్నింగ్ ఇచ్చారు. అప్పట్లో “సింగం 3” సినిమాను ఏకంగా లైవ్ స్ట్రీమ్ చేసి సంచలనం సృష్టించారు వీరు. విశాల్ లాంటి వాళ్లు ఈ సైట్లపై ఎంత యుద్ధం చేసినా ఫలితం లేకుండా పోతుంది.
మరి అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిన 2 .ఓ మొదటి రోజే పైరసీ అయితే ఎలా అని నిర్మాతలు , బయ్యర్లు భయపడుతున్నారు. ఎలాగైనా పైరసీ కాకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నారు. మరి వారి చర్యలు పైరసీ ని ఎలా అడ్డుకుంటాయో చూడాలి.