మహేష్ చిత్రం కోసం !

mahesh vamsi‘ఎవడు’ హిట్ తో అటు చరణ్, ఇటు దర్శకుడు వంశి పైడిపల్లి సూపర్ ఫామ్ లోకి వచ్చేశారు. రిలీజ్ రోజు నుంచి ఈ చిత్రం సూపర్ కలెక్షన్ లతో దూసుకుపోతుంది. ముఖ్యంగా దర్శకుడు వంశి ‘బృందావనం’ ఫామ్ ను ‘ఎవడు’ లో కంటిన్యూ చేసి ఫుల్ జోష్ లో వున్నాడు. ఇప్పడు ఆయన హ్యాట్రిక్ పై కన్నేశాడు. ఇది వరకే మహేష్ బాబు కు వంశి ఓ లైన్ చెప్పారు. మహేష్ ఆ లైన్ కు ఓకే అనడం తో వేరే సినిమాలేవి ఒప్పుకోకుండా మహేష్ మూవీ పైనే వర్క్ స్టార్ట్ చేశాడు. ప్రస్తుతం ఈ స్క్రిప్ట్ పనుల్లో బిజీబిజీ గా గడుపుతున్నాడు వంశి.