తెలుగు చిత్రాలకు జాతీయ అవార్డ్స్ రావడం పట్ల ఆనందం వ్యక్తం చేసిన వెంకీ

67వ జాతీయ చలనచిత్ర అవార్డులను సోమవారం కేంద్రం ప్రకటించిన సంగతి తెలిసిందనే. ఈ అవార్డ్స్ లో నాని జెర్సీ చిత్రానికి అలాగే మహేష్ బాబు మహర్షి చిత్రాలకు అవార్డ్స్ దక్కడం విశేషం. నాని నటించిన జెర్సీ చిత్రానికి ఉత్తమ తెలుగు చిత్రం అవార్డు దక్కగా.. ఉత్తమ వినోదాత్మక చిత్రంగా మహేశ్ బాబు నటించిన మహర్షి నిలిచింది. అలాగే ఇదే సినిమాకి ఉత్తమ కొరియోగ్రాఫర్‌ అవార్డును రాజు సుందరం గెలుచుకున్నారు. ఈ అవార్డ్స్ రావడం పట్ల అభిమానులు , సినీ ప్రముఖులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఇండస్ట్రీ లోని ప్రముఖులు ఆనందం వ్యక్తం చేయగా..తాజాగా మరికొంతమంది హర్షం వ్యక్తం చేసారు.

ఫ్యామిలీ హీరో విక్టరీ వెంకటేష్ విజేతలకు తన బెస్ట్ విషెస్ అందించారు. ఉత్తమ తెలుగు చిత్రంగా అలాగే బెస్ట్ ఎడిటింగ్ క్యాటగిరిలో నాని ‘జెర్సీ’కి రెండు అవార్డులను ప్రకటించారు. వెల్ డాన్ అంటూ.. వెంకటేష్ చిత్ర యూనిట్ కు శుభాకాంక్షలు తెలిపారు. అలాగే అసురన్ సినిమాకు గాను బెస్ట్ యాక్టర్ గా నిలిచిన ధనుష్ కు కూడా వెంకటేష్ విషెస్ అందించారు. సినిమాలో శివస్వామి పాత్రలో అద్భుతంగా నటించారని ఈ అవార్డుకు మీరు అర్హులే అంటూ ట్వీట్ చేశారు.

మంచు లక్ష్మి కూడా జెర్సీ సినిమాకు నేషనల్ అవార్డు వచ్చినందుకు ఆనందం వ్యక్తం చేశారు. నానికి అలాగే టీమ్ సభ్యులందరికి విషెస్ అందిస్తూ నిజంగా చాలా గొప్ప సినిమా అన్నట్లుగా ట్వీట్ చేశారు.