రీమేక్ చేసి చూడండి

vidyabalanనవతరం కథానాయికల పంథా మారింది. ఎవరో చేసిన పాత్రని పోషించడానికి ఇష్టపడడం లేదు. కొత్త కథలు పుట్టాలి, కొత్త పాత్రలు రావాలి.. అంటున్నారు. ఇప్పుడు విద్యాబాలన్ కూడా ఈ మాటే చెప్తోంది. ‘రీమేక్’ కథలు చేస్తే గొప్పదనం ఏముంది? అందులో మన ప్రతిభ ఎక్కడ కనిపిస్తుంది?” అంటోంది. ‘మదర్ ఇండియా’
సినిమాని రీమేక్ చేసే సత్తా ఎవరికి ఉంది? అని సవాల్ విసురుతోంది. “మదర్ ఇండియ ఓ క్లాసిక్. చిన్నప్పుడు స్కూల్ కి వెళ్లే రోజుల్లో ఆ సినిమా పోస్టర్ చూస్తూ నిలబడిపోయేదాన్ని. ఆ సినిమా నన్ను చాలా ప్రభావితం
చేసింది. దాన్ని ముట్టుకొనే ధైర్యం ఎవరికైనా ఉందా? ఎవరైనా ఆ సినిమాని రీమేక్ చేస్తే.. నేను సెల్యూట్ చేస్తా. అయితే నేను మాత్రం నటించను. నర్గీస్ లాంటి నటిని భర్తీ చేయడం ఎవరివల్లా కాదు” అని చెబుతోంది.