విజయ్ ఫై కోపం తో ఉందట..

వరుస హిట్స్ తో యూత్ ఐకాన్ గా క్రేజ్ సొంతం చేసుకున్న విజయ్ దేవరకొండ..ప్రస్తుతం భరత్ కమ్మ డైరెక్షన్లో ‘డియర్‌ కామ్రేడ్‌’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ మూవీ లో స్టూడెంట్స్ కు లీడర్ కనిపించబోతున్నాడని తెలుస్తుంది. గత రెండు నెలలుగా ఈ మూవీ షూటింగ్ కాకినాడలో జరుపుకుంది. ఇక ఇదే షెడ్యూల్‌లో రైలు ఎక్కుతూ విజయ్‌ గాయపడ్డాడు కూడా.. ఈ బిజీ షెడ్యూల్ తర్వాత హైదరాబాద్ వచ్చిన విజయ్ తాజాగా తన సోషల్ మీడియా పేజీ లో అభిమానులతో ముచ్చటించాడు

‘మా అమ్మ నాపై కోపంగా ఉంది. నెలన్నరపాటు ఇంటికి రాలేదు. కాకినాడలో షూటింగ్‌ చేస్తూ బిజీగా ఉన్నాను. ఇక్కడకు వచ్చిన తర్వాత డబ్బింగ్‌, ఇంటర్వ్యూ, న్యూ ఇయర్‌ సెలబ్రేషన్స్‌తో కొంత బిజీగా ఉన్నాను. అందుకే అమ్మానాన్నలను కలవకలేకపోయాను. మనం మన అమ్మానాన్నలకు ఐ లవ్యూ అని గట్టిగా చెప్పం. ఎందుకో మనం ఎక్కువగా చెప్పం. మన లైఫ్‌లో ఎక్కువగా ఉండేది వాళ్లే. అయితే ఈ కొత్త సంవత్సరం నుంచి మనం మన అమ్మానాన్నలకు ఐ లవ్యూ చెబుదాం. ఇప్పుడు మా అమ్మకు ఐ లవ్యూ చెప్పి హగ్‌ ఇచ్చి కూల్‌ చేస్తా.. ఆ వీడియోను షూట్‌ చేస్తా.. మీరు కూడా మీ అమ్మనాన్నలకు ఐ లవ్యూ చెప్పి హగ్‌ ఇచ్చిన వీడియోలను #deverasanta అనే హ్యాష్‌ట్యాగ్‌తో పోస్ట్‌చేయండి. మీకు ఓ సర్‌ప్రైజ్‌ గిఫ్ట్ ఇస్తా’ అంటూ ఓ వీడియోను షేర్‌ చేశాడు.