`వినయ విధేయ రామా` ప్రీ రిలీజ్ బిజినెస్ ఏ రేంజ్ లో ఉందో తెలుసా..?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ – మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో రాబోతున్న చిత్రం `వినయ విధేయ రామా`. రంగస్థలం తర్వాత చరణ్ నుండి వస్తున్న సినిమా కావడం , అలాగే బోయపాటి తో మొదటిసారి చరణ్ జత కట్టడం తో ఈ సినిమా ఫై భారీ అంచనాలే నెలకొని ఉన్నాయి. సంక్రాంతి బరిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ ఓ రేంజ్ లో నడుస్తుందని తెలుస్తుంది.

ఈ సినిమాకి హిందీ డబ్బింగ్ – శాటిలైట్ రూపంలో 22కోట్ల డీల్ పూర్తయిందంటూ ప్రచారం సాగుతుంది. అలాగే నైజాం లో 24కోట్ల రేంజ్ బిజినెస్ చేస్తున్నారన్న సమాచారం అందుతుంది. వీటితో పాటు గోదారి జిల్లాల్లో సుమారు 10కోట్ల పైపెచ్చు బిజినెస్ సాగనుందని తెలుస్తోంది. పశ్చిమ గోదావరి జిల్లాలో భారీ కాంపిటీషన్ నడుమ 5.6 కోట్లకు డీల్ కుదిరిందని ఎన్ ఆర్ ఏ బేసిస్ లో గీతా ఫిలింస్ సంస్థ హక్కులు దక్కించుకుందట.

పశ్చిమ గోదావరి జిల్లాలో ‘రంగస్థలం’ సినిమాను 4.2 కోట్లకు రైట్స్ కొనుక్కుంటే- 6.35కోట్ల షేర్ వసూలు చేసింది. ఇప్పుడు అంతకుమించి `వినయ విధేయ రామా` వసూలు చేయాల్సి ఉంటుందన్న చర్చా సాగింది. అలాగే గుంటూరు ఏరియాలోనూ `రంగస్థలం` భారీ కలెక్షన్స్ సాధించి పంపిణీదారులకు లాభాలు పండించింది. దీంతో అక్కడా `వినయ విధేయ రామా` చిత్రానికి భారీ డిమాండ్ నెలకొందట. గుంటూరు సీ- డీ కేంద్రాల హక్కుల కోసమే 1.6 కోట్లు వెచ్చించి జయరామ్ అనే పంపిణీదారుడు చేజిక్కించుకోవడం హాట్ టాపిక్ అవుతుంది. దీంతో పాటే ఇతర ఏరియాల బిజినెస్ గురించి పంపిణీదారుల్లో పోటీ నెలకొందట.

మొత్తం మీద రంగస్థలం హిట్ తో చరణ్ మార్కెట్ , రేంజ్ బాగా పెరగడం `వినయ విధేయ రామా`కు కలిసొస్తుంది. మరి సినిమా ఎలా ఉండబోతుందో తెలియాలంటే మరో నెల వరకు ఆగాల్సిందే. డివివి దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా దేవి శ్రీ సంగీతం అందిస్తున్నాడు. కైరా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుండగా , స్నేహ , ప్రశాంత్ , ఆర్యన్ రాజేష్ లు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.