మెగాపవర్ స్టార్ రామ్చరణ్, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్లో తెరకెక్కుతోన్న భారీ బడ్జెట్ కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్ `వినయ విధేయ రామ`. అగ్ర నిర్మాత దానయ్య డి.వి.వి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బాలీవుడ్ బ్యూటీ కియరా అద్వాని హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో ప్రశాంత్, ఆర్యన్ రాజేశ్, స్నేహ, వివేక్ ఒబెరాయ్ తదితరులు ప్రధాన తారాణంగా నటిస్తున్నారు.
భారీ బడ్జెట్తో రూపొందుతోన్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్ సంక్రాంతి కానుకగా జనవరి 11 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భాంగా ఈ చిత్ర సెన్సార్ కార్య క్రమాలు ఈరోజు పూర్తి చేసుకుంది. సినిమా చూసిన సెన్సార్ సభ్యులు సినిమాకు ‘U/A’ సర్టిఫికెట్ జారీ చేసారు.
ఫస్ట్ హాఫ్ అంత సరదాగా ప్రేమ , కామెడీ తో సాగిందని , సెకండ్ హాఫ్ యాక్షన్ సీక్వెన్స్ తో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్ తో ఆకట్టుకునేలా ఉందని చెప్పారు. సంక్రాంతి బరిలో వస్తున్న ఈ చిత్రం ఖచ్చితంగా ప్రేక్షకులను అలరిస్తుందని చెప్పడం తో చిత్ర యూనిట్ తో పాటు మెగా అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.