బీజేపీలోకి 107 మంది ఎమ్మెల్యేలు…!


బీజేపీ నేత ముకుల్‌రాయ్ ట్విట్టర్ వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు. తృణమూల్ కాంగ్రెస్, కమ్యూనిస్టు, కాంగ్రెస్ పార్టీలకు చెందిన దాదాపు 107 మంది ఎమ్మెల్యేలు బీజేపీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారని బాంబు పేల్చారు. ఈ 107 ఎమ్మెల్యేల జాబితా తయారు చేశామని, ప్రస్తుతం వాళ్లు మాతో ఫోన్లో టచ్‌లో ఉన్నారని ఆయన ప్రకటించారు. సీఎం మమతా బెనర్జీకి ఇప్పటికే ముచ్చెమటలు పట్టిస్తున్న బీజేపీ ఇప్పుడు మరింత ఎదురుదాడికి సిద్దమైంది. గత పార్లమెంట్ ఎన్నికల్లో 18 సీట్లు సాధించి సంచలనం సృష్టించిన కమలం పార్టీ ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల పై దూకుడు పెంచింది.

 

ముకుల్‌రాయ్ గతంలో మమతా బెనర్జీకి అత్యంత సన్నిహితుడిగా మెలిగారు. అంతేకాకుండా పార్టీలో దాదాపు నెంబర్ 2 స్థానంలో కొనసాగారు. పార్టీకి ఏదైనా ఇబ్బందులు వస్తే ఆయన సమర్థతతో గట్టెక్కించిన సందర్భాలూ ఉన్నాయి. తర్వాత తర్వాత సీఎం మమతా బెనర్జీతో విభేదించి ఆయన బీజేపీలో చేరారు.