రుణమాఫీ కోసం ప్రయత్నిస్తా..!

cm kiranఉత్తరాంధ్ర జిల్లాల్లో సీఎం పర్యటన ప్రశాంతంగా జరిగింది. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి బాధితులను సీఎం పరామర్శించారు. కేంద్రం నుంచి సహాయ సహకారాలు అందించడానికి కృషి చేస్తానని ఆయన అన్నారు. నష్టపోయిన రైతులకు 10వేల రూపాయల నష్టపరిహారం అందిస్తామని సీఎం కిరణ్ ప్రకటించారు. అయితే, రైతులకు రుణమాఫీ చేసేందుకు ప్రయత్నిస్తాని.. అందుకు ప్రధానిని ఒప్పించేందుకు కృషి చేస్తానని కిరణ్ తెలిపారు.