ఆదికేశవులు నాయుడు కన్నుమూత

adikesavulu_naiduటి టి డి మాజీ ఛైర్మన్ డి. కె. ఆదికేశవులు నాయుడు(71) బెంగుళూరు లోని వైదేహి ఆసుపత్రిలో సోమవారం రాత్రి తుది శ్వాస విడిచారు. గత రెండు రోజులుగా  ఆస్పత్రిలో చికిత్స పొందుతూ.. హృదోగ వ్యాధితో కన్నుమూశారు . ఆయనకు భార్య ,కొడుకు ,ఇద్దరు కుమార్తెలు వున్నారు. ఆదికేశవులు నాయుడు చిత్తూరు లోక్ సభ సభ్యుడు గా , తిరుమల తిరుపతి దేవస్థానానికి రెండుసార్లు ఛైర్మన్ గా పదవి బాధ్యతలు నిర్వహించారు. ఆదికేశవులు మృతిపట్ల ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ,తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు ,పీ సీ సీ అధ్యక్షుడు బొత్స ,కేంద్ర మంత్రి చిరంజీవి తదితరులు సంతాపం ప్రకటించారు .