అమిత్ షా హైదరాబాద్ పర్యటన వాయిదా

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా హైదరాబాద్‌ పర్యటన వాయిదా పడింది. కరోనా వైరస్‌ వేగంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో సామూహిక సమావేశాలకి దూరంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ యేడాది హోలీ వేడుకలకి దూరంగా ఉండబోతున్నట్టు ప్రధాని ట్విట్ చేశారు. ఈ కారణంగానే అమిత్ షా హైదరాబాద్ పర్యటనని వాయిదా వేసుకున్నట్టు తెలుస్తోంది.

ఈ నెల 15న అమిత్ షా హైదరాబాద్ లో పర్యటించాల్సి ఉంది. ఈ పర్యటనతో తెలంగాణ భాజాపాలో ఊపు వస్తుందని భావించారు. అంతేకాదు.. హైదరాబాద్ పర్యటనకి వచ్చిన సమయంలో అమిత్ షాని కలవాలని ఏపీ రాజధాని అమరావతి రైతులు ప్లాన్ చేసుకున్నారు. తమ సమస్యలని ఆయన దృష్టికి తీసుకెళ్లాలని భావించారు.