కేసీఆర్‌ పై అమిత్ షా ఫైర్

amith

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ పై విమర్శలు సంధించారు బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఎందుకు అధికారికంగా నిర్వహించట్లేదో చెప్పాలని ప్రశ్నించారాయన. బిజెపి ఆధ్వర్యంలో వరంగల్‌ లో నిర్వహించిన తెలంగాణ విమోచన దినోత్సవ సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు.

ఈ సందర్భంగా మాట్లాడిన అమిత్ షా.. సెప్టెంబర్‌ 17 తెలంగాణ ప్రజలకు సుదినమని, ఈరోజు తెలంగాణ విమోచన వెల్లడించారు. కేసీఆర్‌ను ముఖ్యమంత్రి చేసింది తెలంగాణ ప్రజలని.. వారి మనోభావాలకు అనుగుణంగా ఆయన నడుచుకోవాలని సుచించారు. సెప్టెంబర్‌ 17న విమోచన దినోత్సవాన్ని నిర్వహించకుండా మజ్లీస్‌కు వత్తాసు పలికితే ప్రజలే గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.

అలాగే.. రైతులకు కేసీఆర్‌ ఇస్తానన్న రుణమాఫీ ఏమైందని ప్రశ్నించిన అమిత్ షా.. ప్రధాని బీమా తెలంగాణలో రైతులకు ఇంతవరకు అందలేదని ఆరోపించారు.