జనసేనదే హావ..టీడీపీ అభ్యర్థి సంచలన వ్యాఖ్యలు..

గత ఎన్నికల్లో టీడీపీ పార్టీ కి మద్దతు ఇచ్చిన జనసేన పార్టీ 2019 ఎన్నికల్లో టీడీపీ పార్టీ ని కాదని పోటీ చేసింది. పోలింగ్ తర్వాత జనసేన కు పెద్దగా సీట్లు రావాలని రెండు , మూడు తప్ప గెలిచే అవకాశం లేదని చెప్పినప్పటికీ..తాజాగా తెలుగుదేశం అభ్యర్థి మాగంటి రూప జనసేన దే హావ నడిచిందని..ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాల్లో జనసేన మాములు హావ చూపించలేదని చెప్పడం తో అంత షాక్ అవుతున్నారు.

రాజమండ్రి పార్లమెంటరీ నియోజక వర్గంపై సీఎం చంద్రబాబు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రాజమండ్రి టీడీపీ ఎంపీ అభ్యర్థి మాగంటి రూప, సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఇతర నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమీక్షలో మాగంటి రూప సంచలన వ్యాఖ్యలు చేశారు. తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో జనసేన పార్టీ ఊహించిన దానికంటే ఎక్కువగానే పోటీ ఇచ్చిందని అన్నారు.

ముఖ్యంగా యువత, మధ్యతరగతి కుటుంబాలు ఎక్కువగా పవన్ కళ్యాణ్ పట్ల ఆకర్షితులయ్యారని, ఒక వర్గం ఓట్లు జనసేనకు గంపగుత్తగా పడ్డాయని రూప విశ్లేషించారు. మిగితా జిల్లాల సంగతి ఎలా ఉన్నప్పటికీ ఉభయగోదావరి జిల్లాల్లో మాత్రం జనసేన చాలా గట్టిపోటీ ఇచ్చిందని తెలిపారు.