గెలుపు కోసం పవన్ హోమం..?

మరో ఐదు రోజుల్లో ఆంధ్రప్రదేశ్ లో జరిగిన సార్వత్రిక ఎన్నికల ఫలితాలు రాబోతున్నాయి. అన్ని పార్టీలు తమ గెలుపు ఫై ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గెలుపు కోసం హోమం చేసినట్లు ఓ వార్త బయటకు వచ్చి వైరల్ గా మారింది . గతంలో పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ శ్రీనివాస్ లాంటి పెద్దలు కొందరికి నరసింహం గారు అనే హొమాల గురువు వున్నారన్నది అప్పట్లో ఓ వార్త ప్రచారం అయినా సంగతి తెలిసిందే. తాజాగా అలాంటి హోమమే పవన్ కళ్యాణ్ చేసినట్లు తెలుస్తుంది.

ఈ హోమానికి కాస్త భారీగానే ఖర్చయినట్లు తెలుస్తోంది. అయితే హోమం కన్నా హోమంలో వేసిన పూర్ణాహుతికి ఎక్కువ ఖర్చయిందని అంటున్నారు. సుమారు 50 వేల ఖరీదైన పట్టుచీరను హోమంలో అర్పించినట్లు టాక్. అలాగే కాస్త బంగారం, వెండి, కొన్ని విలువైన రాళ్లు పూర్ణాహుతి సందర్భంగా హోమగుండంలో వేసారని మాట్లాడుకుంటున్నారు. మరి ఈ హోమం ఫలితం ఎలా ఉంటుందనేది మరో ఐదు రోజుల్లో తేలనుంది.