వైసీపీ లోకి మహేష్ ప్రొడ్యూసర్..

ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ వైస్సార్సీపీ పార్టీ లోకి వలసలు పెరుగుతున్నారు. ఇప్పటికే ప్రముఖ నేతలంతా వైసీపీ తీర్థం పుచ్చుకోగా ..ఇప్పుడు సినీ ప్రముఖులు సైతం వైసీపీ లోకి చేరేందుకు ఉత్సహం చూపిస్తున్నారు. ఇప్పటికే 30 ఇయర్స్ పృథ్వి, పోసాని కృష్ణ మురళి, కృష్ణుడు వైసీపీ లో ఉండగా తాజాగా కమెడియన్ అలీ సైతం పార్టీ లో చేరారు.

తాజాగా వైసీపీ కి మరింత బలం రాబోతుంది. స్టార్ ప్రొడ్యూసర్ గా బిజినెస్ మాన్ గా గుర్తింపు ఉన్న పొట్లూరి వరప్రసాద్‌(పీవీపీ) రేపు జగన్‌ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకోబోతున్నారు. విజయవాడ పార్లమెంట్‌ స్థానానికి వైకాపా అభ్యర్థిగా పీవీపీ పోటీ చేసే అవకాశం ఉంది. ఈ నెల 23న ఆయన నామినేషన్‌ వేస్తారని ప్రచారం జరుగుతోంది. గత ఎన్నికల్లోనే వైకాపా తరఫున పీవీపీ విజయవాడ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసేందుకు ప్రయత్నించారు. అయితే అప్పట్లో ఆయనకు సీటు దక్కలేదు. కానీ ఈసారి మాత్రం పక్క సీటు అని చెప్పడం తోనే పీవీపీ జాయిన్ అవుతున్నట్లు తెలుస్తుంది.

ప్రస్తుతం పీవీపీ మహేష్ నటిస్తున్న మహర్షి చిత్రానికి నిర్మాతల్లో ఒకరిగా ఉన్నారు. గతంలో మహేష్ నడిచిన బ్రహ్మోత్సవం చిత్రానికి పీవీపీ నే ప్రొడ్యూసర్.