తెలంగాణ రాష్ట్ర శాసన సభ ఎన్నికల్లో ఘోర పరాజేయాన్ని చవిచూసిన బీజీపీ పార్టీ..ఆంధ్రప్రదేశ్ లో జరగబోయే శాసన సభ ఎన్నికల్లో తన ఉనికిని చాటుకోవాలని చూస్తుంది. ఈ నేపథ్యంలో ఎన్నికల్లో అమలు చేయాల్సిన వ్యూహాలపై ఇప్పటి నుండే కసరత్తు మొదలు పెట్టింది.
ఇందులో భాగంగా రాష్ట్ర ఎన్నికల మేనిఫెస్టో కమిటీని అధిష్టానం నియమించింది. ఈ కమిటీకి ఛైర్పర్సన్గా పురంధేశ్వరిని ఎంపిక చేయడం విశేషం. కన్వీనర్గా ప్రభుత్వ మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావుతోపాటు మరో 9 మందిని సభ్యులుగా నియమించారు.
బీజేపీ మేనిఫెస్టో కమిటీలోని సభ్యులు పేర్లు చూస్తే..
1. డి. పురందేశ్వరి(చైర్పర్సన్)
2. ఐవైఆర్ కృష్ణారావు(కన్వీనర్)
3. పి. విజయ బాబు
4. పీవీఎన్ మాధవ్
5. దాసరి శ్రీనివాసులు
6. షేక్ మస్తాన్
7. పాక సత్యనారాయణ
8. కె. కపిలేశ్వరయ్య
9. పి సన్యాసి రాజు
10. సుదీష్ రాంబోట్ల
11.డీఏఆర్ సుబ్రహ్మణ్యం