లోటస్ పాండ్ దగ్గర టికెట్ లొల్లి…

దేశ వ్యాప్తంగా ఎన్నికల తేదీ ప్రకటన రావడం తో టికెట్స్ లొల్లి మొదలు అయ్యింది. తాజాగా వైసీపీ పార్టీ లో టికెట్స్ చిచ్చు ఏపీ నుండి హైదరాబాద్ లో ఉన్న లోటస్ పాండ్ వరకు వెళ్ళింది. ఉరవకొండ టికెట్ ను శివరామిరెడ్డికి ఇవ్వాలంటూ ఆయనకు సంబందించిన అనుచరులు జగన్ ఇంటి ముందు ఆందోళనకు దిగారు. ఈ విషయం తెలుసుకున్న వివేకానందరెడ్డి అక్కడికి చేరుకోవడం తో ఆందోళన కారులు మరింత రెచ్చిపోయారు.

వివేకానందరెడ్డి కారును అడ్డుకొని తమ నేతకు టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేసారు. ఈ నేపథ్యంలో వివేకానందరెడ్డి పార్టీ తరపున ఎవర్నీ అభ్యర్ధిగా ప్రకటించినా వారి తరపున పని చేయాల్సిన బాధ్యత మనకుంది అంటూ వారిని బుజ్జగించే ప్రయత్నం చేశారు. అయినాగానీ వివేకానందరెడ్డి మాటలు పట్టించుకోకుండా ఆందోళన చేసారు. మరి ఈ టికెట్ విషయంలో జగన్ ఏం చేస్తారో చూడాలి.