వైకాపాలోకి మరో కాంగ్రెస్ ఎమ్మెల్యే!

Rajesh-MLAరాష్ర్టంలో అధికార కాంగ్రెస్ పార్టీ నుండి వైకాపాలోకి వలసల పరంపర కొనసాగుతూనే ఉంది. తాజాగా కాంగ్రెస్ చింతలపూడి ఎమ్మెల్యే రాజేష్ ఈరోజు చంచల్ గూడ జైలులో ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిశారు. అనంతరం రాజేష్ విలేకరులతో మాట్లాడుతూ… ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నందునే జగన్ మోహన్ రెడ్డిని ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ అగ్రనేతలే పలుమార్లు ప్రస్తావించారని గుర్తుచేశారు. తాను ధైర్యంగా జగన్ పార్టీకి మద్ధతు పలుకాతున్నానని చెప్పుకొచ్చారు. కాగా, కాంగ్రెస్ పార్టీ నుండి ౯ మంది ఎమ్మెల్యేలను సస్పెండ్ చేస్తున్నట్లు పీసీసీ అధ్యక్షుడు బొత్స ప్రకటించిన నేపథ్యంలో…రాజేష్-జగన్ మోహన్ రెడ్డిల భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే.. బొత్స ప్రకటనపట్ల ఆ పార్టీ అధిష్టానంతో పాటు, స్వంత పార్టీ నేతలే గుర్రుగా ఉన్నట్లు సమాచారం.