వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో మరో వికెట్ పడింది. ప్రకాశం జిల్లాలో ఆ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. నిన్న గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్రెడ్డి టీడీపీలో చేరగా… ఈరోజు కందుకూరు ఎమ్మెల్యే పోతుల రామారావు సైకిలెక్కారు. విజయవాడలో టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో ఆయన పార్టీ కండువా కప్పుకున్నారు.