తెలంగాణ కోసం మరో విద్యార్థి బలిదానం

bardwaj-telanganaతెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో జాప్యం జరుగుతోందని కలత చెందిన వరంగల్ జిల్లా హన్మకొండ పట్టణం గోపాల్ పూర్ కు చెందిన బిటెక్ విద్యార్థి భరద్వాజ్ (20) కాలేజ్ ప్రాంగణంలో వంటిపై డీజీల్ పోసుకుని ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డ విషయం తెలిసిందే. అయితే శరీరం 95 శాతం పైగా కాలిన గాయాలతో ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ భరద్వాజ్ సోమవారం రాత్రి తుదిశ్వాస విడిచాడు. సహచర విద్యార్థులు అందించిన సమాచారం ప్రకారం.. రోజు మాదిరిగా ఉదయం 8.30 గంటలకు భరద్వాజ్ కళాశాలకు వెళ్లేముందు గూడెప్పాడులోని పెట్రోల్ బంకులో డీజీల్ కొనుగోలు చేసి తన బ్యాగ్ లో బాటిల్ పెట్టుకుని అందరికంటే అరగంట ముందుగానే కళాశాలకు చేరుకున్నట్లు స్నేహితులు తెలయజేస్తున్నారు. మొదటి అంతస్తు బాల్కనీలోకి వెళ్లి డీజిల్ ను ఒంటిపై పోసుకొని నిప్పంటించుకున్నాడు. ‘జై తెలంగాణ’ అని అరుస్తూ పరిగెత్తాడు. ఇది చూసిన వాచ్ మేన్ తో పాటు ప్రక్కనే ఉన్నపత్తి చేలల్లోంచి రైతులూ వచ్చి మంటలను ఆర్పేసి 108కు సమాచారం అందించగా వాహనంలో వరంగల్ ఎంజీఎం తరలించారు. ఎంజీఎంలో కాలిన గాయాలతో చికిత్స పొందుతూ భరద్వాజ్ సోమవారం రాత్రి తుదిశ్వాస విడిచాడు.