టీడీపీ మిత్ర ధర్మాన్ని విస్మరిస్తోంది

ఏపీ భాజాపా నేతలకు టీడీపీతో కలిసి నడవటం అస్సలు ఇష్టం లేనట్టు అనిపిస్తోంది. ఇటీవలే ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేతో కలిసి భాజాపా ఎమ్మెల్యే విష్ణుకుమార్ ప్రెస్ మీట్ పెట్టడం హాట్ టాపిక్ గా మారారు. ఇందులో వైసీపీ నుంచి వచ్చి మంత్రులైన వారు వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. విష్ణుకుమార్ కామెంట్ జాతీయ స్థాయిలో హైలైట్ అయ్యింది. ఇప్పుడు ఆ పార్టీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు టీడీపీ మిత్రబంధాన్ని విస్మరిస్తోందని ఆరోపిస్తున్నారు.

కేంద్ర ప్రభుత్వ అభివృద్ధిని తమ ప్రభుత్వానికి ఆపాదించుకుంటూ తెలుగుదేశం ప్రచరం చేసుకుంటోందన్నది సోము ప్రధాన ఆరోపణ. ఇందుకు కాకికాన మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికలే ఉదాహరణని అని చెబుతున్నాడు. అంతేకాదు.. తెలుగుదేశం పార్టీ చేసిన మోసాన్ని ఎప్పటికీ మరిచిపోబోమని ఆయన అంటున్నాడు. ఈ పరిస్థితులని బట్టి చూస్తే వచ్చే సాధారణ ఎన్నికల్లో భాజాపా-టీడీపీ కలిసి నడవటం కష్టమే.. !