కాంగ్రెస్ వేధిస్తుంది : అసద్

Asaduddin1ఎంఐఎం నేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీకి బెయిల్ మంజూరైన విషయం తెలిసిందే. అనంతరం అసద్ మీడియాతో మాట్లాడుతూ… కాంగ్రెస్ వేధిస్తుందని ఆరోపించారు. మతతత్వపార్టీ అయిన బీజేపీతో కాంగ్రెస్ కుమ్మక్కై తమపై వేధింఫులకు పాల్పడుతుందని వాపోయారు. అధికారం శ్వాశ్వతం కాదన్న విషయాన్ని కాంగ్రెస్, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తెలుసుకోవాలని హితువు పలికారు. కాంగ్రెస్ వ్యతిరేకంగా ఎవ్వరూ మాట్లాడినా వారిపై కక్ష్య సాధింపునకు కాంగ్రెస్ ప్రభుత్వం పూనుకుంటుందని ఆరోపించారు.