ఆర్టికల్ 371 డీ ని సవరించడంకానీ, రద్దుచేయడంగానీ చేయకుండా రాష్ట్రం విభజించడం కుదరదని ఏపీఎన్జీవోల అధ్యక్షుడు అశోక్బాబు తేల్చిచెప్పారు. ఈరోజు అశోక్ విలేకరులతో మాట్లాడుతూ.. పార్టీలు తీసుకునే నిర్ణయాలు ప్రజల నిర్ణయాలు కాదని, రాష్ట్రం సమైక్యంగా ఉంచాలన్నదే ప్రజల అభిమతమని వివరించారు. సమైక్యవాదం బలహీన పడిందనడంలో అర్థంలేదని ఆయన స్పష్టం చేశారు. రాజకీయ దురుద్దేశంతోనే.. కేంద్రం అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పటు చేస్తోందని ఆయన అన్నారు. అయితే, అన్ని రాజకీయ పార్టీలు అఖిలపక్ష సమావేశాన్ని బహిష్కరించాలని అశోక్ బాబు పిలుపునిచ్చారు. విభజన విషయంలో.. కేంద్రం దూకుడు తగ్గించిందంటే కారణం ఉద్యమమేనని ఆయన అన్నారు. 8 కోట్ల ఆంధ్రుల్లో 6 కోట్ల మంది ఆంధ్రులు విభజనను వ్యతిరేకిస్తున్నారన్న విషయాన్ని గుర్తించుకోవాలని అశోక్ సూచించారు.