రాష్ట్ర విభజనసై ఎన్ని అఖిలపక్ష కమిటీలు వేసిన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తథ్యమని రాష్ట్రమంత్రి బస్వరాజు సారయ్య అభిప్రాయ పడ్డారు. విభజన తర్వాత సీమాంధ్ర ప్రజలకు కావాల్సిన ప్రయోజనాలకోసమే ఈ అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహిస్తున్నారని తెలిపారు. ఇందిరాగాంధీ 29వ వర్ధంతిని పురస్కరించుకొని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఇందిరా గాంధీ చిత్ర పటానికి మంత్రి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రిలో గర్భిణీ స్రీలకు పండ్లు పంపిణీ చేశారు. నవంబర్ 9న వరంగల్లో నిర్వహించే కాంగ్రెస్ విజయోత్సవ సభలో ఎటువంటి మార్పులేదని మంత్రి సారయ్య తెలిపారు.