విజయమ్మకు చేదు అనుభవం!

vijayammaవైకాపా గౌరవాధ్యక్షురాలు విజయమ్మకు చేధు అనుభవం ఎదురైంది. ఖమ్మం జిల్లాలో వరద బాధితులను పరామర్శించడానికి వెళ్లిన విజయమ్మ వెళ్లారు. అయితే, కొందరు తెలంగాణ వాదులు ఆమె కాన్వాయ్ పై కోడిగుడ్లతో దాడి చేశారు. దీంతో.. అక్కడ ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. దీంతో.. రంగంలోకి దిగిన పోలీసులు అయిదుగురు ఆందోళన కారులను అదుపులోనికి తీసుకున్నట్లు తెలుస్తోంది. కాగా, వైకాపా సమైక్యాంధ్ర బోర్డు తగిలించుకుందని.. తెలంగాణ ఆకాంక్షను అర్థం చేసుకొని విజయమ్మను తెలంగాణలో పర్యటించకుండా అడ్దుకోవాలని టీ-నేతలు, టీ-జేఏసీ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. మరోవైపు, నల్లగొండ జిల్లా హుజూరాబాద్ వద్ద వై.ఎస్.విగ్రహాలకు కొందరు నిప్పు పెట్టారు.