కర్ణాటకలో బీజేపీకి మరో ఓటమి !

కర్ణాటకలో బీజేపీకి అస్సలు కలిసిరావడం లేదు. ఇటీవల జరిగిన సాధారణ ఎన్నికలో రాష్ట్రంలో అతిపెద్ద పార్టీగా అవతరించినప్పట్టికినీ.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోయింది. కేంద్రంలో మోడీ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత బీజేపీకి తగిలిన తొలి దెబ్బ ఇదే. ఆ డిప్రెషన్ లో ఉండగానే కర్ణాటక బీజేపీ మరో ఎదురు దెబ్బతగిలింది.

జయానగర్‌ శాసనసభ నియోజక వర్గానికి జరిగిన ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ అభ్యర్థి సౌమ్యారెడ్డి విజయం సాధించారు. బిజెపి అభ్యర్థి ప్రహ్లాద్‌పై 2889 ఓట్ల మెజారిటీతో సౌమ్యారెడ్డి విజయం సాధించారు. ఈ ఫలితం కర్ణాటక బీజేపీని మరింత కుంగదీసేదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.