షిండేను బర్తరఫ్ చేయాలి : బీజేపీ

Kishan reddyభాజాపా, ఆర్ ఎస్ ఎస్ లపై కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే చేసిన వ్యాఖ్యలకు నిరసనగా భాజపా ఇందిరాపార్క్ వద్ద ఈరోజు సత్యాగ్రహం చేపట్టింది. ఈ సత్యాగ్రహంలో బీజేపీ రాష్ర్ట పార్టీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి, బండారు దత్తాత్రేయ, బంగారు లక్ష్మణ్త దితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ… షిండేను తక్షణమే బర్తరఫ్  చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే వచ్చే పార్లమెంట్ సమావేశాలలో ప్రభుత్వాన్ని నిలదీస్తామని పేర్కొనారు. రాజకీయంగా ఎదుర్కొనే దమ్ములేకనే షిండే లాంటి.. బీజేపీ, ఆర్ ఎస్ ఎస్ లపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని దయ్యబట్టారు.