జూన్ నాటికి ఏపీ నూతన రాజధాని.. !

ap capitalss నవ్యాంధ్రకు నూతన రాజధాని నిర్మాణ ప్రక్రియను వేగవంతం చేసింది ఏపీ సర్కారు. జూన్ నాటికి ఏపీ నూతన రాజధాని మాస్టర్ ప్లాన్ సిద్ధం కానుంది. ఈ విషయాన్ని స్వయంగా సీఆర్డీఏ కమిషన్ శ్రీకాంత్ వెల్లడించారు. విజయవాడలో ఈరోజు (బుధవారం) ఆయన మీడియాతో మాట్లాడుతూ… సింగపూర్ పర్యటన తర్వాత రాజధానిపై స్పష్టత వచ్చిందన్నారు. నెలాఖరు నాటికి 10వేల ఎకరాల భూ సమీకరణ చేయనున్నట్లు ఆయన తెలిపారు. మూడు లేయర్లలో ఆంధ్రప్రదేశ్ రాజధాని నగరాన్ని నిర్మిస్తామని కాగా, ఫిబ్రవరి 2, 4 తేదీల్లో సింగపూర్ బృందం రాజధాని ప్రాంతంలో మరోసారి పర్యటించనుంది.