ఎగ్జిట్ పోల్స్పై తెలుగుదేశం శ్రేణులు నిరాశ చెందాల్సిన అవసరం లేదని.. తెలుగుదేశం గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు టీడీపీ నేత బుద్దా వెంకన్న. ఎగ్జిట్ పోల్స్ దాదాపు జగన్ గెలుపు ఖాయమని చెబుతున్న నేపధ్యంలో ఆయన మీడియా ముందుకు వచ్చారు.
ఏపీ ఎన్నికలపై నిన్న వచ్చిన ఎగ్జిట్ పోల్స్ ఏవీ నిజం కావని ,2014 ఎన్నికల ముందు కూడా వైకాపా నేతలు ఇంతకంటే ఎక్కువే ఊహల్లో తేలారని.. అప్పుడు ఎగ్జిట్ పోల్స్కి భిన్నంగా రాష్ట్రంలో ఫలితం వచ్చిందని ఆయన గుర్తుచేశారు. లగడపాటి అంచనాలకు మించి టీడీపీ సీట్లు వస్తాయని.. 130 స్థానాలు గెలిచి తీరుతామని మీడియా సమావేశంలో ఆయన తొడగొట్టారు. జగన్తో కలిసి మోదీ మైండ్ గేమ్ ఆడుతున్నారని, అయితే నాలుగోసారి ముఖ్యమంత్రిగా చంద్రబాబే ప్రమాణం చేసి సరికొత్త చరిత్ర సృష్టిస్తారని ధీమా వ్యక్తం చేశారు.