అన్నదాతలను ఆదుకోవాలి : బాబు

babuరాష్ట్రంలో అధిక వర్షం, వరదల వల్ల అపార నష్టం కలిగిందని.. దీనిని జాతీయ విపత్తుగా ప్రకటించాలని తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు డిమాండ్ చేశారు. ఈ విషయంపై ప్రధాని మన్మోహన్ సింగ్ కు లేఖరాస్తానని ఆయన తెలిపారు. నిన్న బాబు పశ్చిమగోదావరి జిల్లాలోని వరద ముంపు ప్రాంతాలలో పర్యటించి రైతులను పరామర్శించారు. ఈ సందర్భంగా బాబు మాట్లాడుతూ.. రాష్ర్టంలో అసమర్థ ప్రభుత్వం ఉండటం వల్ల రైతు అన్నమో రామచంద్ర అనే పరిస్థతి దాపురించిందని రైతులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు.