పేదరికం లేని సమాజం చూడాలి : బాబు

cbnభారీ వర్షం, వరదల కారణంగా నష్టపోయిన రైతులకు నష్ట పరిహారాన్ని అందించడంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం విఫలమైందని తెదేపా అధినేత చంద్రబాబు ఆరోపించారు. నల్లగొండ జిల్లా దామరచర్ల ప్రాంతంలో భారీవర్షాల బాధితులను బాబు ఈరోజు పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సమస్యలకు పరిష్కారం ఆత్మహత్యలు కాదన్నారు. తాను చిన్నప్పటి నుంచి కష్టపడి చదువుకున్నానని, ఏడు కిలోమీటర్ల దూరం నడిచి చదువుకున్నానని అన్నారు. తండ్రి ని అడ్డు పెట్టుకుని తాను రాజకీయాలలోకి రాలేదని చంద్రబాబు అన్నారు. ’పేదలు లేని సమాజం చూడాలన్నదే’ తన ఆశయమని బాబు పేర్కొన్నారు. కాగా, వరద బాధితులకు 80 కిలోల బియ్యం, 5 వేల రూపాయల పరిహారం ఇవ్వాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.